క్రైమ్/లీగల్

భార్య గొంతు కోసి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరిపెడ, జులై 30: పట్టపగలే పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రథమ చిక్సిత కేంద్రంలో అతికిరాతకంగా భార్యను గొంతు కోసి హత్య చేసి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త లొంగిపోయిన సంఘటన మంగళవారం మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బేతంపెల్లి గ్రామ శివారు టిక్యి తండాకు చెందిన బోనుతు సేవ్యనాయక్‌కు ఐదు సంవత్సరాల క్రితం మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామ శివారు ధారవతు తండాకు చెందిన లక్‌పతి కుమారై కస్తూరిని ఇచ్చి వివాహం జరిపించారు. వివాహం జరిగిన నాటి నుండి ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయ. రెండు నెలల క్రితం భార్యాభర్తల మధ్య గొడవపడటంతో భార్య ఇద్దరి పిల్లలతో తల్లి గారి ఇంటికి వచ్చింది. పది రోజుల నుండి మండల కేంద్రంలోని వెంకన్న ప్రథమ చిక్సిత కేంద్రంలో బోనుతు కస్తూరి (25) పనికి చేరింది. ఇదే అదనుగా భావించిన నిందితుడు సేవ్యనాయక్ ప్రథమ చిక్సిత కేంద్రానికి వచ్చి భార్యతో మాట్లాడుతూ వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. మృతురాలికి ఒక కుమారై, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చిత్రాలు.. రక్తపుమడుగులో పడి ఉన్న కస్తూరి
ఇన్‌సెట్‌లో కస్తూరి (ఫైల్‌ఫొటో)