క్రైమ్/లీగల్
అనుమానాస్పదస్థితిలో యువకుడి ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 1 August 2019
ఘట్కేసర్, జూలై 31: అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం పరిధిలోని పడమటి సోమారం గ్రామానికి చెందిన సంఘం భీం కుమారుడు ప్రణయ్ (23) అంకుషాపూర్లోని భాస్కర్ బ్రిక్స్ కంపెనీలో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లి మాదారం గ్రామంలోని సర్వే నెంబర్ 72లోగల స్థలంలో ఉన్న గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అదే స్థలంలో బైక్ లభ్యమైంది. ప్రణయ్ ఆత్మహత్యకు కారణమేమిటో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.