క్రైమ్/లీగల్
కళాశాల బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జీడిమెట్ల, జూలై 31: కళాశాల బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థి దుర్మరణం చెందిన సంఘటన దుందిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా ఇసుక చింతలపల్లి గ్రామానికి చెందిన ఎన్.కృష్ణారెడ్డి కుమారుడు ఎన్.వీరేశ్ రెడ్డి (20) చింతల్లోని బంధువుల ఇంట్లో ఉంటూ బీటెక్ చదువుతున్నాడు. దుందిగల్లోని మర్రిలక్ష్మన్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో వీరేశ్ రెడ్డి బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. చింతల్ నుంచి ద్విచక్ర వాహనంపై కళాశాలకు స్నేహితుడు ప్రవీణ్తో కలిసి వెళ్తున్నారు. గండిమైసమ్మ ఎంఎల్ఆర్ కమాన్ సమీపంలో కళాశాల బస్సు వెనుక నుంచి వీరేశ్ రెడ్డి బైక్ను ఢీకొట్టింది. ఘటనలో తీవ్ర గాయాలకు గురైన వీరేశ్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.