క్రైమ్/లీగల్

బాలిక కిడ్నాప్, అత్యాచారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణాదేవిపేట, జూలై 31: బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన సంఘటన విశాఖపట్నం జిల్లాలోని ఎఎల్ పురంలో చోటు చేసుకుంది. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి బాలిక తల్లిపై దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటనపై బాలిక తల్లి మేకల లోవ రూరల్ ఎస్పీ ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు నర్సీపట్నం ఎఎస్పీ అరీఫ్ హఫీజ్ బుధవారం గ్రామాన్ని సందర్శించి బాలిక తల్లిదండ్రులను విచారించారు. వివరాలివి. ఎఎల్ పురం గ్రామానికి చెందిన లోవ కుమార్తె స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. బాలిక తల్లి లోవకు సొంత మేనల్లుడు శ్రీకాంత్ ఉన్నాడు. ఆరు నెలల కిందట శ్రీకాంత్ తల్లిదండ్రులైన దీప, మరిడయ్యలు కుమార్తెను శ్రీకాంత్‌తో వివాహం చేయాలని బాలిక తల్లిని అడిగారు. చదువు పూర్తయిన అనంతరం మాట్లాడుకుందామని తల్లి బదులిచ్చింది. మేనల్లుడు కొంత కాలంగా ఎఎల్ పురంలోని మేనత్త లోవ ఇంటికి వస్తూపోతూ మనస్సును మార్చేందుకు ప్రయత్నించినప్పటికీ బాలిక తల్లి లోవ అంగీకరించ లేదు. ఈ నేపథ్యంలో ఈనెల 24వ తేదీన బాలికను శ్రీకాంత్ కిడ్నాప్ చేశాడు. ఒడిషాలోని గంజామ్ జిల్లా అష్టా గ్రామానికి తీసుకుపోయాడు. తన కుమార్తె కనిపించకపోవడంతో బాలిక తల్లి లోవ బంధువుల వద్ద ఆరా తీయగా శ్రీకాంత్ స్వగ్రామంలో ఉన్నట్టు ఆమెకు తెలిసింది. తన కుమార్తెను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడినట్టు లోవ ఎఎస్పీ హఫీజ్‌కు వివరించింది. కిడ్నాప్ చేసిన సందర్భంలో తనపై దాడి చేసినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించారు. శ్రీకాంత్, అతని తల్లిదండ్రులు దీప, మరిడయ్యలపై కేసు నమోదు చేసినట్టు సీఐ ఉదయ్‌కుమార్ తెలిపారు. ఈవిచారణలో ఎస్సై బుచ్చిరాజు పాల్గొన్నారు.