క్రైమ్/లీగల్

ఒంటరి మహిళపై దాడి..పుస్తెల తాడు చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఆగస్టు 1: భర్త రోజు డ్యూటీ పై బయటకు వెళ్లాడు. ఇంతలోనే దొంగ ఇంట్లోకి వచ్చాడు. ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేసి మెడలోని బంగారు పుస్తెల తాడును లాక్కొని పారిపోయారు. ఈ సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్ బీరప్పగడ్డలో నివసిస్తున్న మల్లేపల్లి కృష్ణ ఆటో డ్రైవర్. అతడు నిత్యం రాత్రి వేళల్లో ఆటో తీసుకుని బయటకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి కూడా బయటకు వెళ్లిన పది నిమిషాల్లోనే గుర్తుతెలియని వ్యక్తి వచ్చి తలుపులు కొట్టాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న కృష్ణ భార్య అనసూయ తెరువడంతో అకస్మాత్తుగా దాడి చేసి మెడలో ఉన్న మూడు తులాల పుస్తెల తాడును బలవంతంగా లాక్కొని పారిపోయాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జి డీఐ రవి కుమార్ తెలిపారు.
ట్రాక్టర్ బోల్తా :ముగ్గురికి తీవ్రగాయాలు
కీసర, ఆగస్టు 1: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా కొట్టిన సంఘటనలో ముగ్గురికి తీవ్రగాయలైన సంఘటన రాంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రాంపల్లిలోని నీలగిరి హోమ్స్‌లో నిర్మిస్తున్న ఇళ్లకు మల్లాపూర్ నుంచి ట్రాక్టర్‌లో టైల్స్ తీసుకు వస్తున్నారు. కూలీలు ట్రాక్టర్‌లోనే ఉన్నారు. బాలాజీ ఫంక్షన్ హాల్ సమీపానికి రాగానే అకస్మాత్తుగా ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ట్రాక్టర్‌లో ఉన్న సూరమ్మ, కాళీ, అచ్చయ్య క్రింత పడిపోగా, వారిపై టైల్స్ పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే 108 వాహనంలో నగరంలోని తులసి ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తుజరుపుతున్నారు.