క్రైమ్/లీగల్

కోటి రూపాయల గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, ఆగస్టు 2: అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా శుక్రవారం ఎప్పటిలాగానే స్థానిక పోస్ట్ఫాసు సెంటర్ వద్ద స్పెషల్ పార్టీ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. దారకొండ నుంచి సీలేరు మీదుగా వస్తున్న వాహనాన్ని పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా వాహనంలో ఉన్న డ్రైవర్, క్లీనర్ దూకి పారిపోయారు. వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని తనిఖీ చేయగా అందులో 570 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. గంజాయిని, వాహనాన్ని సీజ్ చేసారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై నీలకంఠం విలేఖరులతో మాట్లాడుతూ మావోయిస్టుల అమర వీరుల వారోత్సవాల నేపథ్యంలో తమ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి తరలిస్తున్న వ్యాన్‌ను పట్టుకున్నామన్నారు. పట్టుబడిన గంజాయి ఈప్రాంతంలో పది లక్షలు ఉంటుందని, బయట ప్రాంతంలో కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా వేసారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.