క్రైమ్/లీగల్
తిరుమలలో మద్యం సేవించి వాహనం నడిపినందుకు తొమ్మిది మందికి మూడు రోజుల జైలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 2 August 2019
తిరుపతి, ఆగస్టు 2: తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తూ మద్యం సేవించిన వారిని, వాహనం నడిపిన వారికి, లైసెన్సులు సక్రమంగా లేని వారికి తిరుమల క్యాంప్కోర్టు న్యాయమూర్తి కొరడా ఝుళిపించారు. తొమ్మిది మందికి ఒక్కొక్కరికి మూడు రోజులు చొప్పున జైలుశిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చారు. తిరుమల ట్రాఫిక్ డిఎస్పీ రమణకుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో లైసెన్సులు, వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్లు సక్రమంగా లేనివారిని గుర్తించారు. వీరికి 67,950 రూపాయలు జరిమానా విధించారు. అలాగే హాకర్లకు మూడు రోజులపాటు జైలుశిక్ష విధిస్తూ తిరుమల క్యాంప్కోర్టు న్యాయమూర్తి వై.గోపాలకృష్ణ తీర్పునిచ్చారు.