క్రైమ్/లీగల్
కొనేరులో మునిగి విద్యార్థి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 5 August 2019
కీసర, ఆగస్టు 4: ప్రమాదవశాత్తు విద్యార్థి కోనేరులో మునిగి మృతిచెందిన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నరేందర్ గౌడ్ కథనం ప్రకారం.. మేడ్చల్ మండలం, కలాకల్ గ్రామానికి చెందిన శ్యాంసుందర్ (14) కీసరగుట్ట గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
ఆదివారం సెలవు దినం కావటంతో ఉదయానే్న స్నేహితుడు భరత్తో కలిసి కీసరగుట్టలో నిర్మాణంలో ఉన్న అరణ్య లింగేశ్వరాలయం కోనేరులో ఈత కొట్టేందుకు కొనేరులో దిగాడు. ఈత రాని శ్యాంసుందర్ కొలనులో ఇరుక్కుపోయి ప్రాణాలు వదిలాడు. అక్కడే ఉన్న భరత్ వెంటనే గురుకుల పాఠశాల సిబ్బందికి తెలియజేసాడు. సీఐ నరేందర్ గౌడ్ అక్కడికి చేరుకొని కొలనులో నుంచి మృతదేహాన్ని బయటకు తీసారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు