క్రైమ్/లీగల్

స్కూల్ బస్సు, బైక్ ఢీ: విద్యార్థి, యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, ఆగస్టు 5: ఇంటి నుంచి ఎంతో హుషారుగా పాఠశాలకు బయలుదేరిన ఒక విద్యార్థి, ఓ యువకుడు పాఠశాల అతి సమీపంలో ప్రమాదానికి గురై అక్కడిక్కడే మృతిచెందిన సంఘటన సోమవారం మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధి బడంగ్‌పేట్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా గోపాల్ పేట్ మండలానికి చెందిన పానిగంటి సురేందర్ అతని భార్య రేణుక బడంగ్‌పేట్ ఏజీఆర్ కాలనీలో నివాసం ఉంటూ, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వారికి శ్రేయస్(10) కుమారుడు, లోక్షిత (7) కుమార్తె ఉన్నారు. బడంగ్‌పేట్‌లోని దిల్‌సుఖ్ నగర్ పబ్లిక్ స్కూలో శ్రేయస్ 3వ క్లాస్, లోక్షిత్ ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం చెన్నూరు గ్రామానికి చెందిన గోర్ల శేఖరయ్య, శివమ్మల కుమారుడు జీ.బాలకృష్ణ డిగ్రీ పూర్తి చేసి, బడంగ్‌పేట్ ఏజీఆర్ కాలనీలో నివాసం ఉంటూ డ్రైవింగ్ చేస్తున్నాడు. సురేందర్, రేణుకకు బాలకృష్ణ సమీప బంధువు. శ్రేయస్, లోక్షితను బాలకృష్ణ రోజు పాఠశాలలో తన గ్లామర్ బైక్‌పై స్కూల్‌లో దింపుతాడు. రోజు మాదిరిగా సోమవారం ఉదయం బైక్‌పై శ్రేయస్, లోక్షితను దింపడానికి ఏజీఆర్ కాలనీ నుంచి స్కూల్‌కి తీసుకువస్తున్నాడు. స్కూల్‌కు అతి సమీపంలో ఎదురుగా వచ్చిన ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొనడంతో బైక్‌పై ఉన్న బాలకృష్ణ, శ్రేయస్ అక్కడిక్కడే దుర్మరణం చెందగా, లోక్షిత స్వల్పగాయాలతో బైటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.