క్రైమ్/లీగల్

అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, ఆగస్టు 5: కుటుంబ కలహాలతో విడాకులు తీసుకున్న మహిళ మద్యానికి బానిసై ఆర్థిక ఇబ్బందులకు గురైంది. ఇంట్లో మతదేహంగా మారడంతో పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేశారు. చందానగర్ పోలీసుల కథనం ప్రకారం.. వివరాలిలా ఉన్నాయి. పాపిరెడ్డి కాలనీలోని రాజీవ్ గృహకల్ప బ్లాక్ నెంబర్ 63లోని 15వ నెంబర్ గదిలో శే్వతా లక్ష్మీ (42) నివసిస్తుంది. 15 ఏళ్ల క్రితం భార్యాభర్తల మధ్య గొడవలు తీవ్రం కావడంతో విడాకులు తీసుకుని ఒంటరిగానే నివసిస్తుంది. లక్ష్మీ మద్యానికి బానిసగా మారి, తన తమ్ముడు శివకుమార్ వద్ద డబ్బులు అడుక్కుని తరుచూ తాగుతుండేది. హఠాత్తుగా సోమవారం ఇంట్లో పడిపోయి ఉండడాన్ని గమనించిన స్థానికులు తన తమ్ముడు శివకు ఫోన్ చేసి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న చందానగర్ ఇన్‌స్పెక్టర్ బీ.రవీందర్, ఎస్‌ఐ శంకర్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సైబరాబాద్ క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి వివరాలు సేకరించారు. ఇన్‌స్పెక్టర్ రవీందర్ అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.