క్రైమ్/లీగల్

ఏపీ స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 10: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికై, తెలుగు దేశంలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు, మంత్రివర్గంలో చేరిన విషయంలో దాఖలైన పిటిషన్‌పై మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు మంగళవారం ఏపీ అసెంబ్లీ స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. తమ పార్టీ తరఫున ఎన్నికైన 24 మంది ఎమ్మెల్యేలు, మంత్రివర్గంలో చేరిన నలుగురు మంత్రులపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్ కోడెల శివప్రసాద్ వద్ద పిటిషన్ దాఖలు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని మంళగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆళ్ల తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మంగళవారం వాదన వినిపించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. కోర్టు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.