క్రైమ్/లీగల్

రైలు నుంచి జారిపడి వృద్ధుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార్ల, ఆగస్టు 12: వేగంగా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి జారిపడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన గార్ల రైల్వే స్టేషన్ సమీపంలోని పాకాల ఏరు రైల్వే వంతెన వద్ద సోమవారం తెల్లావారుజామున చోటు చేసుకుంది. మహబూబాబాద్ రైల్వే పోలీసులు కథనం ప్రకారం విజయవాడ నుంచి ఖాజీపేట వైపు వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి వ్యక్తిపడి మృతి చెందాడని, సుమారు 65 సంవత్సరాల వయస్సు కలిగిన మృతుడు తెల్ల చొక్కా, నల్లని ప్యాంటు ధరించి ఉన్నాడని, తెనాలి పట్టణంలో రైలు ఎక్కినట్లుగా రైల్వే టికెట్ ఉందన్నారు.