క్రైమ్/లీగల్

క్యారీ గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం (ఖిల్లా), ఆగస్టు 12: క్యారీకి తీసిన గుంతలో ఉన్న నీటిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన ఖమ్మంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం బక్రీదు సెలవురోజు కావడంతో నగరంలోని వైఎస్‌ఆర్ కాలనీకి చెందిన స్నేహితులు షేక్ మున్నా(9), షేక్ నాగులు(9) ఈతకు వెళ్ళారు. ఆ ప్రాంతంలో క్వారీ తవ్వకం చేసిన గుంతలో వర్షపునీరు చేరి నిండుగా ఉండటంతో అక్కడ ఈత కొట్టాలని నిర్ణయించుకుని దిగారు. ప్రమాదవశాత్తు లోతట్టు ప్రాంతంలో మునిగి మృతి చెందారు. పిల్లలు ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానికులతో కలసి వెతికారు. గుంతల్లో బాలురు మృతి చెందడం గమనించిన వారు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. అర్భన్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి వరకు తమతో ఉన్న ఇద్దరు పిల్లలు మృతి చెందటడంతో ఆ ప్రాంతంలో విషాదచాయలు అలుముకున్నాయి.