క్రైమ్/లీగల్

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవనకొండ, ఏప్రిల్ 13: మార్కులు తక్కువగా వచ్చాయని ఇంటర్ మీడియట్ విద్యార్థి రాజశేఖర్‌రెడ్డి (17) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ గంగయ్యయాదవ్ తెలిపారు. శుక్రవారం పోలీసుల తెలిపిన కథనం మేరకు దేవనకొండకు చెందిన రాజశేఖర్‌రెడ్డి తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ పరీక్షలు రాశాడు. శుక్రవారం ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల కావడంతో అందులో రాజశేఖర్‌రెడ్డికి మార్కులు తక్కువగా రావడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరులేని సమయంలోఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.