క్రైమ్/లీగల్

అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, ఆగస్టు 30: నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న భువనగిరి పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది గొలనుకొండ లింగయ్య కూతురు కీర్తన (17) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లుగా స్థానికులు తెలిపారు. హైద్రాబాద్ సమీపంలోని కొల్లూరు గ్రామం నారాయణ కళాశాలకు చెందిన నర్మద క్యాంపస్‌లో విద్యనభ్యసిస్తున్న కీర్తన గురువారం సాయంత్రం అనారోగ్యానికి గురైందని కళాశాల యాజమాన్యం వెంటనే బీహెచ్‌ఈఎల్ సమీపంలోని సిటిజన్ ఆసుపత్రికి తరలించినట్లుగా సమాచారం. వెంటనే ఆసుపత్రికి వెళ్లగా అప్పటికే కీర్తన మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించినట్లుగా లింగయ్య తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న తన కూతురు ఆకస్మికంగా మృతికి కళాశాల యాజమాన్యం కారణమని ఆరోపించారు. తన కూతురు మరణం పట్ల ప్రభుత్వం విచారణ జరపాలని ఆయన కోరారు.