క్రైమ్/లీగల్
విషం కలిసిన కేక్ తిని తండ్రీ కొడుకుల మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సిద్దిపేట/ చేర్యాల, సెప్టెంబర్ 5: బర్త్డే వేడుకలు కుటుంబంలో విషాదం నింపింది. విషం కలిసిన బర్త్డే కేక్ తిని తండ్రీకొడుకులు మృతి చెందగా తల్లీ, కూతుళ్ల పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఇస్తరిగల్ల రవి, భాగ్యలక్ష్మి కుమారుడైన ఇస్తరిగల్ల రాంచరణ్ (9) పుట్టిన రోజు వేడుకలను బుధవారం రాత్రి వారి ఇంట్లో జరుపుకున్నారు. ఈ క్రమంలో బర్త్డే కేక్ను సిద్దిపేటలో ఉండే రవి వరుసకు తమ్ముడైన శ్రీనివాస్ పంపాడు. ఆ కేక్ను కట్ చేసి తిని నిద్రిస్తున్న క్రమంలో కేక్ తిన్న వారందరికీ వాంతులు, విరేచనాలు కావడంతో వారిని చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా, కేకులో విషం కలిసిందని వెంటనే పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించటంతో సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తండ్రి రవి (39), కుమారుడు రాంచరణ్ (9) మృతి చెందగా తల్లి భాగ్యలక్ష్మి, కూతురు పూజిత పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిద్దరినీ హైదరాబాద్కు తరలించారు. తల్లి భాగ్యలక్ష్మికి జ్వరం రావటంతో కేక్ను కొద్దిగా తిందని తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. అయితే మృతుడు రవి సిద్దిపేటలో ఉండే శ్రీనివాస్ అన్నదమ్ములు వారి మధ్య కొంతకాలంగా భూతగాదాలు ఉన్నాయి. ఇటీవల ఓ కార్యక్రమానికి బుధవారం ఐనపూర్ గ్రామానికి వచ్చిన వచ్చిన శ్రీనివాస్ అన్న రవి కుమారుని బర్త్డే విషయం తెలుసుకొని తాను కేక్ తెప్పిస్తానని చెప్పి నమ్మించి అందులో విషం కలిపి పంపించాడని దాంతో వారు మృత్యువాత పడ్డారని అందుకు బాధ్యుడైన శ్రీనివాస్ను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ ఏరియా ఆసుపత్రికి వచ్చి మృతదేహాలను పరిశీలించి అందుకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్న హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ మాట్లాడుతూ విషం కలిపిన కేక్ను తినటం వల్లనే తండ్రీ, కొడుకులు రవి, రాంచరణ్ మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
చిత్రాలు.. తండ్రి రవి కుమారుడు రాంచరణ్ (ఫైల్)