క్రైమ్/లీగల్

నీటి కుంటలో పడి బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలమత్తూరు, ఏప్రిల్ 14 : మండల పరిధిలోని కొక్కవాండ్లపల్లికి చెందిన సంతోష్ (9) సోమఘట్ట నీటి గుంతలో పడి మృతి చెందాడు. కొక్కవాండ్లపల్లికి చెందిన రమేష్, శోభ కుమారుడు సంతోష్ రెండు రోజులుగా అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు చుట్టుపక్కల గ్రామాలు, బంధువుల ఇళ్లలో గాలించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈనేపథ్యంలో శనివారం ఉదయం సోమఘట్ట చెరువు నీటి గుంతలో శవమై కనిపించాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు, మున్నీరుగా విలపించారు. నాలుగేళ్ల క్రితం మృతుడి సోదరి అనారోగ్యంతో మృతి చెందగా ప్రస్తుతం ఉన్న కుమారుడు కూడా మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు వర్ణణాతీతం. కాగా ఇదే నీటిగుంతలో మూడు నెలల క్రితం ఓ చిన్నారి పడి మృతి చెందిన ఘటన మరవక ముందే మరో బాలుడు సంతోష్ మృతి చెందడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.