క్రైమ్/లీగల్

పెన్నానదిలో విద్యార్థి గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఏప్రిల్ 15:మైలవరం పెన్నానదిలో ఆదివారం విద్యార్థి ఈతకు వెళ్లి గల్లంతైన సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు జమ్మలమడుగు పట్టణం నేతాజినగర్‌కు చెందిన తలారి ఎలమకూరి పాండురంగయ్య, ఉశే్శనమ్మ కుమారుడు పరశురాం(11) విద్యార్థి పెన్నానీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. పరశురాం దొమ్మరనంద్యాల జడ్పీ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. మైలవరం జలాశయం నుండి పెన్నానదికి వదిలిన నీటిలో ఈతకు నలుగురు స్నేహితులతోకలిసి వెళ్లాడు. నీటి ప్రవాహం ఉధృతికి కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న మైలవరం పోలీసులు గాలింపుచర్యలు చేపట్టినా ఆచూకి లభ్యం కాలేదు. ఇప్పటికీ గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు మైలవరం ఎస్‌ఐ సునీల్‌కుమార్ రెడ్డి తెలిపారు.