క్రైమ్/లీగల్

పెళ్లి ఇంట విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొందూరు, ఏప్రిల్ 15: సోదరి వివాహంలో తల్లిదండ్రులకు సహకారం అందించడంలో భాగంగా పెళ్లి శుభలేఖలతో ఇంటినుండి బయలుదేరిన ఐదు నిమిషాలకే ఆ యువకుడిని ట్రాక్టర్ రూపంలో మృత్యువు కాటేసింది. పెళ్లి పనుల్లో తోడుగా ఉన్న కుమారున్ని చూసి ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. శుభలేఖలు పంచే బాధ్యతను అప్పగించడంతో కార్డులును తీసుకువెల్లిన కుమారుడు అంతలోనే మృత్యువాత పడ్డాడన్న సమాచారంతో ఆ ఇంటిలో విషాధం చోటు చేసుకుంది. నాలుగురోజుల్లో పెళ్లి భాజాలు మోగాల్సిన ఇంట విషాధ ఛాయలు అలముకున్నాయి. పొందూరు మండలం బొట్లపేట గ్రామం వద్ద ట్రాక్టరు ఢీ కొట్టడంతో జి.సిగడాం మండలం మదుపాం గ్రామానికి చెందిన కామర్స్ గణేష్ (16) మృతిచెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెల్తే జి.సిగడాం
మండలం మదుపాం గ్రామానికి చెందిన కామర్స్ నాగరాజు, రాజేశ్వరల కుమార్తె సత్యవతి వివాహం ఈ నెల 19న జరగవలసి వుంది. సోదరి పెళ్లిశుభలేఖలు పంపిణీ చేసేందుకు ద్విచక్ర వాహనంపై స్నేహితుడు బగాది నవీన్‌తో కలసి శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో మదుపాం లోని ఇంటినుండి పొందూరు బయలుదేరారు. బొట్లపేట మల్లిఖార్జున స్వామి ఆర్చి వద్ద ఆటోను తప్పించే ప్రయత్నంలో ఒక వైపు ఆగివున్న ట్రాక్టర్ ముందు భాగంను ఢీకొనడంతో బైకు అదుపుతప్పి పడిపోయింది. రోడ్డుకు తల బలంగా ఢీ కొనడంతో తీవ్రగాయాలైన గణేష్‌తో పాటు స్వల్పగాయాలైన నవీన్ సమీపంలో ఉన్నారు. శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గణేష్ మృతి చెందాడు. గాయాలైన నవీన్ శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కార్డులు పంచేందుకు వెల్లిన కుమారుడు విగతజీవిగా రావడంతో తల్లిదండ్రులు నాగరాజు, రాజేశ్వరి, సోదరి సత్యవతిలు బోరున విలపిస్తున్నారు. సీఐ రామకృష్ణ, ఎస్సై బాలరాజులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుని తండ్రి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసును నమోదుచేసారు. విశాఖ కేజీహెచ్‌లో వున్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించారు.