క్రైమ్/లీగల్
ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గూడెంకొత్తవీధి, అక్టోబర్ 23: విశాఖ మన్యంలో పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో మాజీ మావోయిస్టు సభ్యుడిని మావోయిస్టులు హతమార్చారు. విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలం పెదపాడు గ్రామానికి చెందిన తాంబేలు లంబయ్య అలియాస్ దివుడు(45)ని మావోయిస్టు కాల్చిచంపారు. గతంలో మావోయిస్టు పార్టీలో లంబయ్య పనిచేస్తూ 2011లో పోలీసులకు పట్టుబడ్డాడు. నాలుగు సంవత్సరాల పాటు జైలులో ఉండి 2013లో బెయిల్పై విడుదలయ్యాడు. స్వగ్రామమైన పెదపాడులోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పంట చేనులో ఉన్న లంబయ్యను మావోయిస్టులు మంగళవారం సాయంత్రం పొద్దు పొడిచాక కుంకుంపూడి రహదారికి వద్దకు తీసుకువచ్చి తుపాకీతో కాల్చి చంపారు. సంఘటనా ప్రదేశంలో మావోలు వదిలిపెట్టిన లేఖ విడిచిపెట్టారు. లంబయ్య పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడని, పోలీసు ఇచ్చే డబ్బులకు కక్కుర్తి పడుతుండడం వలనే హతమార్చినట్లు మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ నేత బిరుసు పేర్కొన్నారు.