క్రైమ్/లీగల్

అలిపిరి నడకదారిలో ఉరేసుకొని భక్తుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 25: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే అలిపిరి నడకమార్గంలోని అన్నమయ్య నడకదారి అటవీ ప్రాంతంలో ఓ భక్తుడు ఉరివేసుకొని మృతిచెంది ఉండటాన్ని భక్తులు గుర్తించి అధికారులకు తెలిపారు. సమాచారం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. మృతుడు తమిళనాడుకు చెందిన సుందరరాజన్‌గా గుర్తించారు. కాగా ఉరివేసుకున్న వ్యక్తి శరీరం మోకాళ్లపై కూర్చున్న భంగిమలో ఉంది. ఆత్మహత్యకు పాల్పడి ఉంటే సదరు మృతదేహం గాలిలో వేలాడాల్సి ఉంది. అయితే చెట్టుకు తాడుకట్టి తలకు ఉరి వేసుకొని మోకాళ్లపై కూర్చొన్నట్లుగా మృతదేహం కనబడుతోంది. ఆత్మహత్యకు పాల్పడ్డ భక్తుడు చెట్టుపైకి ఎక్కి తాడును మెడకు వేసుకొని కిందికి దూకాడా? లేక మరెవరైనా అతన్ని హత్యచేసి ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాగా మృతుడు గళ్లు కలిగిన చొక్కా, ఎర్రపంచెను ధరించి ఉన్నాడు. చేతికి వాచీ ఉంది సమీపంలో ఒక బ్యాగు కూడా ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. కాగా శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు. అతనికి సంబంధించిన ఇంటి చిరునామా, ఇతర ఆధారాలపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు.