క్రైమ్/లీగల్

టిప్పర్ ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలిదిండి, అక్టోబర్ 28: టిప్పర్ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని మట్టగుండ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం చాబత్తిన మహేష్ (15), కర్రే స్వామి(18) ఇరువురు ద్విచక్ర వాహనంపై ఖాళీ గ్యాస్ బండను తీసుకువెళుతుండగా మట్టగుంట నుంచి కలిదిండి వెళుతున్న టిప్పర్ లారీ ఢీ కొట్టటంతో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను భీమవరం ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. కైకలూరు సీఐ జయకుమార్, కలిదిండి ఇన్‌ఛార్జి ఎస్‌ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.