క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, అక్టోబర్ 28: విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం మండలంలోని గౌరవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన కొండపాటి గోపీనాథ్ (20) మునగచర్లలోని తన తల్లిని తీసుకురావడానికి బైక్‌పై వెళుతూ ప్రమాదానికి గురయ్యాడు. గ్రామం నుంచి బయలుదేరిన కొద్దిదూరంలోనే బైక్ డివైడర్‌ను ఢీకొనడంతో తలకు ఇనుప చువ్వలు, రోడ్డు బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ దుర్ఘటన పండగ పూట ఆ కుటుంబంలో విషాదం నింపింది. 10వ తరగతి వరకు చదువుకున్న గోపీనాథ్ గ్రామ సమీపంలోని ఒక ప్రయివేట్ కర్మాగారంలో ఉద్యోగం చేస్తున్నాడు. మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ కట్టా నరసింహారావు సంఘటన స్థిలిని పరిశీలించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. చిల్లకల్లు ఎస్‌ఐ అభిమన్యు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.