క్రైమ్/లీగల్

దంతెవాడలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (క్రైం), అక్టోబర్ 28: ఛత్తీస్‌ఘ్ఢ్ రాష్ట్రం దంతెవాడ సమీపంలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విజయనగరానికి చెందిన నలుగురు మృతి చెందారు. విజయనగరం మిమ్స్‌లో అనాటమీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ సునీత కుటుంబీకులు ఏడుగురు రెండు రోజుల క్రితం ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం జగదల్‌పూర్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్, కొన్ని పర్యాటక ప్రాంతాల సందర్శనకు వెళ్లారు. చిత్రకూట్ వాటర్ ఫాల్స్ చూశాక అక్కడి నుంచి రైలుమార్గంలో దంతెవాడకు వచ్చారు. అక్కడ ఒక ప్రైవేట్ క్యాబ్‌ను మాట్లాడుకుని దంతెవాడ దంతేశ్వరీ ఆలయం, సమీపంలోని కొన్ని పర్యాటక ప్రాంతాల సందర్శనకు వెళ్లారు. ఈ క్రమంలో జగదల్‌పూర్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఒక చెట్టును వీరు వెళ్తున్న వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే వైద్యురాలు సునీత, ఆమె కుమార్తె శ్రేయ చనిపోగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారు. వీరిలో సునీత భర్త లక్ష్మణరావు, సోదరుడు వి.రమేష్ ఉన్నారు. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. విజయనగరంలోని సీతంపేటకు చెందిన వి.త్రిమూర్తులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వాహనం నడుపుతున్న డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.