క్రైమ్/లీగల్

కన్నబిడ్డలను కడతేర్చిన కసాయ తల్లి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్మెట, అక్టోబర్ 28: తన పిల్లలను అల్లారుముద్దుగా పెంచాల్సిన తల్లి తన ఇద్దరు చిన్నపిల్లలను మెడలు కత్తితో నరికి హత్యచేసి, తానూ కత్తితో మెడను నరుక్కొన్న దారుణం జనగామ జిల్లా నర్మెట మండలం శివభూక్యతండాలో సోమవారం సాయంత్రం చేటుచేసుకుంది. తండా వాసులు తెలిపిన వివరాల ప్రకారం... శివభూక్య తండాకు చెందిన భానోతు రమ కూతురు భానుశ్రీ(4), వరుణ్(3)లను ఇంట్లో ఎవరూ లేని సమయంచూసి సాయంత్రం పెద్దకత్తితో వారి మెడలను నరికిచంపింది. అనంతరం తాను మెడకోసకొని ఆత్మహత్యకు పాల్పడబోయింది. మెడ కొంతవరకు గాయమై అనంతరం రక్తస్రావం తీవ్రంగా ఉండడంతో కిందపడిపోగా సమీపంలో ఉన్న తండావాసులు కేకలను గమనించి చూడగా చిన్నపిల్లలు మృతిచెంది ఉన్నారు. పక్కనే తల్లి రమ మెడ కోసుకొని కిందపడిపోయిన సంఘటనను చూసి అవాక్కయ్యారు. వెంటనే ఆమెను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణమని తండావాసులు చర్చించుకున్నారు. భర్త గోపాల్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పరమేశ్వర్ తెలిపారు.
*చిత్రాలు.. తల్లిచేతిలో హత్యకు గురైన చిన్నారులు భానుశ్రీ, వరుణ్
* మెడ నరుక్కొని ప్రాణాపాయ స్థితిలో ఉన్న బానోతు రమ