క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పమిడిముక్కల, నవంబర్ 9: మండల పరిధిలోని కృష్ణాపురం-ఐలూరు మార్గంలో దళిత శ్మశాన వాటిక వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని ఎస్‌ఐ జి శ్రీనివాస్ తెలిపారు. ఐలూరు వైపు వెళుతున్న షైనీ బైక్, కృష్ణాపురం వైపు వస్తున్న టీవీఎస్ మోపెడ్ శ్మశానవాటిక మలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు కిందపడగా వారికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఇద్దరిని విజయవాడ కామినేని ఆసుపత్రికి, ఒకరిని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.