క్రైమ్/లీగల్

పెనుమూరులో రోడ్డు ప్రమాదం : తండ్రి, ఇద్దరు బిడ్డలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుమూరు, నవంబర్ 9: మోగిలిఘాట్ రోడ్డు ప్రమాదం మరువక ముందే చిత్తూరు జిల్లాలో మరో విషాధ సంఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి పెనుమూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రితో పాటు ఇద్దరు బిడ్డలు దుర్మరణం చెందారు. మండల పరిధిలోని రాజఇండ్లు వద్ద లారీని ద్విచక్రవాహనం ఓరవ్ టేక్ చేయబోయే క్రమంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో లారీ చక్రాల కింద పడి తండ్రి, కుమారుడు, కుమార్తె అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పెనుమూరు మండలం చింతపెంట తూర్పు హరిజనవాడకు చెందిన శ్రీను (35) గత కొంతకాలంగా తిరుపతిలోని జీవకోనలో స్థిరపడ్డాడు. ఇతనికి భార్య నిర్మల, కుమార్తె నిహారిక (13), మనోహర్ (8) ఉన్నారు. శ్రీను పెనుమూరులో కూడా వెల్డింగ్ పనులు చేసేవాడు. ఈ క్రమంలో ఇటీవల ఇతని వరసకు చెల్లెలికి వివాహమైంది. ఆదివారం స్వగ్రామమైన తూర్పు హరిజనవాడలో పెళ్లి విందును నిర్వహించనున్నారు. తిరుపతిలో ఉన్న పిల్లలను ఈ విందుకు శనివారం సాయంత్రం ద్విచక్ర వాహనంలో శ్రీను తీసుకొస్తుండగా, పెనుమూరు నేండ్రగుంట రహదారిలో రాజులఇండ్లు వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపుతప్పి శీనుతో అతని పిల్లలైన నిహారిక, మనోహర్ లారీ చక్రాల కింద పడిపోవడంతో ముగ్గురు సంఘటనాస్థలంలోనే మరణించారు. మృత దేహాలను పోస్టు మార్టం నిమత్తం చిత్తూరు ఆసుపత్రికి తరలించారు. పెనుమూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.