క్రైమ్/లీగల్

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన 42మందికి శిక్ష, జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 16: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 42మందికి జరిమానా, మ రికొందరికి కోర్టు జైలుశిక్ష విధించింది. నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు ఆదేశాలతో నగరం లో కొనసాగుతున్న స్పెషల్ డ్రంకెన్ డ్రై వ్‌లో భాగంగా రెండో ట్రాఫిక్, నాలు గో ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన 42 మందిని సోమవారం మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. 42మందికి రూ. 92,500 రూపాయలు జరిమానా విధించడంతో పాటు వారిలో మోతాదు మించి మద్యం తాగిన ఒక వ్యక్తికి మూడురోజులు జైలు, ముగ్గురికి రెండురోజులు జైలు, ఇద్దరికి ఒకరోజు జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పుచెప్పారు.