క్రైమ్/లీగల్
క్యాబ్ డ్రైవర్ హత్య కేసులో ముగ్గురికి రిమాండ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాజేంద్రనగర్, ఏప్రిల్ 25: క్యాబ్ డ్రైవర్ను హతమార్చిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు. బుధవారం రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వివరాలను ఏసీపీ అశోక్, సురేష్ వెల్లడించారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల షాపూర్ ప్రాంతానికి చెందిన షేక్ హఫీజ్(20) డ్రైవర్, అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ తన్వీర్(20), మహ్మద్ జహంగీర్(21) స్నేహితులు. వీరు ఎలాగైనా ఈజీ మనీ సంపాదించాలని భావించారు. రాజేంద్రనగర్ చింతల్మెట్ మహ్మద్ జహంగీర్(20) క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. కాగా ఈనెల 20వ తేదీన మహ్మద్ జహంగీర్ క్యాబ్ను బుక్ చేశారు. పటాన్చెరు వద్దకు చేరుకున్నారు. కానీ, నిర్మానుష్య ప్రాంతం కాకపోవడంతో జహీరాబాద్ వైపునకు వెళ్లారు. జహీరాబాద్ వద్ద నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే జహంగీర్పై ముగ్గురు దాడి చేసి హతమార్చారు. జీడిమెట్ల పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి హత్య కేసు మిస్టరీని ఛేదించారు.