క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెర్లాం, ఏప్రిల్ 27: మండలం రాజయ్యపేట గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని తెర్లాం హెచ్‌సీ శ్రీనివాసరావు తెలిపారు. ఈమేరకు ఆయన అందించిన వివరాల ప్రకారం మండలం లోచర్ల గ్రామానికి చెందిన మర్రాపు పైడపునాయుడు(45), సర్పంచ్ మర్రాపు చిన్నంనాయుడులు బైక్‌పై బొబ్బిలి నుంచి తెర్లాం వెళుతుండగా అదుపుతప్పి బోల్తాపడటంతో పైడపునాయుడు అక్కడికక్కడే మృతిచెందగా సర్పంచ్ చిన్నంనాయుడుకు గాయాలయ్యాయి. ఈమేరకు సర్పంచ్ చిన్నంనాయుడును చికిత్స నిమిత్తం కేర్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈనెల 30,1,2 తేదీలలో గ్రామదేవత ఉత్సవాలు జరగనున్న దృష్ట్యా బంధువులకు, నాయకులకు ఆహ్వానపత్రికలను ఇచ్చి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడు పైడపునాయుడుకు భార్య పార్వతి, హాస్ని, లహరి అనే ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఈవిషయం తెలుసుకున్న భార్య, పిల్లలు, బంధువుల రోధన వర్ణణాతీతం. ఈసంఘటనతో రాజయ్యపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ తెలిపారు.