క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిడుగురాళ్ల, ఏప్రిల్ 28: ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన పిడుగురాళ్ల మండలం, జానపాడు గ్రామ శివారులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. జానపాడు గ్రామానికి చెందిన కొబ్బెర కృష్ణమూర్తి (52), మక్కెన సతీష్ (28) ద్విచక్ర వాహనంపై కారంపూడి నుండి జానపాడు వస్తుండగా పిడుగురాళ్ల నుండి కారంపూడి వెళ్తున్న అన్నపురెడ్డి శివకోటేశ్వరరావు, అన్నపురెడ్డి గోపిల ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికీ తీవ్రగాయాలు కాగా కృష్ణమూర్తి, సతీష్‌ల పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో ఇద్దరూ మృతిచెందారు. పిడుగురాళ్ల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.