క్రైమ్/లీగల్
సెల్ఫీ తీస్తూయువకుడి ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
దిల్సుఖ్నగర్, మే 17: సెల్ఫీ చిత్రికరించుకొని యువకుడు ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సరూర్నగర్ పోలిస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ మండలం అన్నోజీ గూడ ప్రాంతానికి చెందిన సాయిగౌడ్ (21) సరూర్నగర్ జీహెచ్ఏసీ కార్యాలయం సమీపంలో అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. వృత్తిరిత్యా స్థానికంగా ఓ సంస్థలో ఎగ్క్యూటివ్గా పనిచేస్తున్నాడు. బుధవారం అర్ధరాత్రి సమయంలో తన ఫోన్లో సెల్ఫీని చిత్రికరించుకొని ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెందాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అదించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీన పర్చుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. తన మృతికి గల కారణాలు తెలియలేదు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.