క్రైమ్/లీగల్

కలెక్టరేట్ పైనుంచి దూకి ఉద్యోగిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 18: కర్నూలు నగరంలోని కలెక్టరేట్ భవనం పైనుంచి దూకి ఓ ఉద్యోగిని శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. ఆళ్లగడ్డ మండలం బత్తులూరులో ఐసీడీఎస్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న శోభారాణి శుక్రవారం కర్నూలులో జరిగిన సమావేశానికి హాజరైంది. కలెక్టరేట్‌లో ఓ వైపు డీఆర్‌సీ సమావేశం జరుగుతుండగానే మేడపైకి చేరుకుని అక్కడి నుంచి కిందికి దూకింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇది గమనించిన సిబ్బంది వెంటనే జేసీ ప్రసన్న వెంకటేష్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన సంఘటనాస్థలానికి చేరుకుని జరిగిన విషయంపై ఆరా తీశారు. శోభారాణి ఆత్మహత్యకు పై అధికారుల వేధింపులే కారణమని మృతురాలి బంధువులు ఆరోపించారు. తరుచూ మెమోలు జారీ చేయడంతో తీవ్రంగా కలత చెందిన శోభారాణి ఆత్మహత్య చేసుకుందన్నారు. శోభారాణి మృతికి అధికారులదే బాధ్యత అని వారు ఆరోపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.