క్రైమ్/లీగల్

తల్లీకూతుళ్ల ఉసురు తీసిన కుటుంబ కలహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, మే 18: గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో కుటుంబ కలహాలు తల్లీకూతుళ్ల ప్రాణాలు బలిగొన్నాయి. మరో చిన్నారి విషమ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని కరివేపాకు వారి వీధిలో నివాసం ఉంటున్న పూసపాటి రామారావు, దుర్గ్భావాని (25) దంపతులకు ఇద్దరు కుమార్తెలు. గురువారం రాత్రి భార్య భర్తల మధ్య ఏర్పడిన కలహాల నేపథ్యంలో శుక్రవారం ఉదయం భర్త బయటికి వెళ్లిన సమయంలో మూడేళ్ల కుమార్తె హిమశ్రీ, ఏడాదిన్నర వయసున్న కుమార్తె సాయిలను ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసి అదే ఫ్యానుకు దుర్గ్భావాని కూడా ఉరేసుకుంది. ఇరుగుపొరుగు గమనించి తలుపులు పగులగొట్టి చూడటంతో అప్పటికే తల్లి దుర్గ్భావాని, ఏడాదిన్నర కుమార్తె సాయి మృతిచెందారు. కొనఊపిరితో ఉన్న హిమశ్రీని హుటాహుటిన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హిమశ్రీ అక్కడ చికిత్స పొందుతోంది. తల్లి, కుమార్తెల ఆత్మహత్య దావానలంగా వ్యాపించడంతో పరిసర ప్రాంత ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి చూసివెళ్లారు. తల్లీ, బిడ్డల మృతదేహాలను చూసి బంధువులు రోదించారు. పట్టణ సీఐ బి హరికృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హరికృష్ణ తెలిపారు.