క్రైమ్/లీగల్

గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిగి, మే 22 : మండల పరిధిలోని కొడిగెనహళ్లి విద్యుత్ సబ్‌స్టేషన్ వెనుక భాగంలో ఉన్న ఓ వేపచెట్టుకు గుర్తు తెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. ఆ వ్యక్తి ఉరేసుకుని నాలుగు రోజులు అయి ఉంటుందని అభిప్రాయ పడ్డారు. ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి
గాండ్లపెంట, మే 22 : మద్యం అతిగా తాగి కదిరి వీవర్స్ కాలనీకి చెందిన రాజశేఖరరెడ్డి (38) మంగళవారం మృతిచెందాడు. ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు రాజశేఖర్‌రెడ్డి గుజరీ వ్యాపారం చేస్తుండేవాడని, మద్యం బాగా తాగాడు. రోజూ వ్యాపారం చేసుకుని మునగలవారిపల్లి యూపీ స్కూల్ వరండాలో రాత్రిపూట నిద్రించేవాడన్నారు. అయితే సోమవారం రాత్రి అతిగా మద్యం తాగి నిద్రపోయాడని, మంగళవారం ఎంతసేపటికీ నిద్రలేవలేకపోతే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు వచ్చి మృతి చెందినట్లు గుర్తించారు. భార్య కళావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు.
గాయపడ్డ విద్యార్థి మృతి
గోరంట్ల, మే 22 : మండల పరిధిలోని వానవోలులో ఈతకు వెళ్లి గాయపడిన గిడ్డన్నగారి హరీష్ (15) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎఎస్సై ఆంజనేయులు తెలిపారు. మంగళవారం పిల్లలతో కలిసి ఈతకు వెళ్లిన హరీష్ ప్రమాదవశాత్తు రాయిపై పడటంతో గాయపడినట్లు తెలిపారు. బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. తండ్రి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.