క్రైమ్/లీగల్

తండ్రిపై కత్తితో తనయుడి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్సెట్టిపేట, మే 22: మండలంలోని దౌడపల్లిలో తనయుడు తండ్రిపై కత్తితో దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మంచిర్యాలకు చెందిన కునారపు మల్లయ్య తన కూతురు వద్ద ఉంటున్నాడు. మల్లయ్యకు ఇద్దరు భార్యలు ఉన్న ట్లు తెలిసింది. కాగా కొంత కాలం క్రితం మల్లయ్య తన రెండో భార్యను చంపిన కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చి తన కూతురి వద్ద ఉంటున్నాడు. తన రెండో భార్య కుమారుడు అయిన రాజశేఖర్ మంగళవారం తన మరో ఇద్దరితో వచ్చి తండ్రి వద్దకు వచ్చి విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసి పరారయ్యారు. ఒక్కసారిగా ఉలికిపడ్డ కూతురు ఇరుగుపోరుగు వారిని పిలిచి మల్లయ్యను ప్రథమ చికిత్స కోసం లక్సెట్టిపేట ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. అయితే దాడికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. రాజశేఖర్ తన తల్లిని చంపాడన్న కక్షతో కానీ లేక అస్తి పాస్తులు తనకు ఇవ్వలేదన్న కసితో ఈ హత్య చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా నిందితులు పరారీలో ఉన్నారు. మల్లయ్య కూతురు పాతాల మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మధుసూధన్ రావు తెలిపారు.