క్రైమ్/లీగల్

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, మే 26: మండలంలోని కనిమెరక రైల్వే గేటు సమీపంలో రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. బొబ్బిలి రైల్వే హెచ్‌సి నారాయణరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతి చెందిన వ్యక్తి ఐదు అడుగుల నాలుగంగుళాల పొడవు సుమారు 55 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటాడని తెలిపారు. తెలుపురంగు లాల్చీ, నీలంరంగు గడుల లుంగీ, గులాబీరంగు గడుల తువ్వాలతో కలిగి ఉన్నాడని తెలిపారు. చామనఛాయ రంగు కలిగి ఉన్నాడని, ఎడమకాలు పాదంపైన దెబ్బకట్టు ఉందని అన్నారు. ఎడమచేయి నుండి కట్టు వద్ద సిలేన్ బాటిల్ ఎక్కించేందుకు ఐవి సెట్ ఉందని తెలిపారు. శవ పంచనామ అనంతరం గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందిన సమాచారం బొబ్బిలి రైల్వే హెచ్‌సి శ్రీనివాసరావు, ఎఎస్‌ఐ అంభరీష్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.