క్రైమ్/లీగల్

మహిళను హత్యచేసిన ఫాస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట టౌన్, మే 26: రాజంపేట మండలం బోయనపల్లెకు చెందిన కొమ్మి ఇందిరమ్మ (30)ను సమీపంలోని చర్చి ఫాస్టర్ సుబ్బరాయుడు హత్యచేసిన సంఘటన శనివారం తెల్లవారు జామున జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. బోయనపల్లె దళితవాడకు చెందిన వర్ల సుబ్బరాయుడు కొంతకాలంగా ఏసుక్రీస్తు చర్చిలో ఫాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో చర్చికి సమీపంలో నివసిస్తున్న ఇందిరతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. అక్క, బావ కువైట్‌కు వెళ్లడంతో వారిపిల్లల సంరక్షణ చూసుకుంటూ భర్తతో కలసి ఇందిర బోయనపల్లెలో నివాసం ఉంది. శనివారం తెల్లవారు జామున ఇందిర ఇంటికెళ్లిన సుబ్బరాయుడు నీవు నాతోనే కాకుండా ఇతరులతో ఎందుకు మాట్లాడుతున్నావంటూ గొడవపడి గొంతునులిమి హతమార్చాడు. ఆ సమయంలో ఇందిర అక్క పిల్లలైన తరుణ్, కుసుమ అడ్డుతగలడంతో సుబ్బరాయుడు వారిపై కూడా దాడిచేశాడు. వారు వెంటనే తలుపుకు గడిపెట్టి బోరుమని ఏడవడంతో చుట్టూపక్కల వారు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా ఇందిర హత్యకు గురై ఉంది. ఫాస్టర్ సుబ్బరాయుడు మన్నూరు పోలీసులకు లొంగిపోయాడు. నేరస్థలాన్ని డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ నరసింహులు, ఎస్సై మహేష్‌నాయుడు, కడప క్లూస్ టీం పరిశీలించారు. మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.