క్రైమ్/లీగల్

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుత్తలూరు, జూన్ 1 : ఎద్దుల లోడుతో వెళ్తున్న ట్రాలీ ఆటో ముందు చక్రం పంచర్ కావడంతో రోడ్డుపక్కన నిలిపి వేయగా దాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుత్తలూరు మండలం చింతలగుంట గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా గంథసిరి గ్రామానికి చెందిన రావెళ్ల నరసింహారావు, కోటపాటి ఆంజనేయులు మర్రిపాడు మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లో రెండుజతల ఎద్దులను కొనుగోలు చేసి ట్రాలీ ఆటోలో స్వగ్రామానికి బయలుదేరారు. చింతలగుంట సమీపంలోకి వచ్చేసరికి వాహనం ముందు చక్రం పంచర్ కావడంతో రోడ్డుపక్కన నిలిపారు. రెండు జతల ఎడ్లలో ఒక జతను కిందికి దించి అవతలి వైపు కట్టేశారు. డ్రైవర్ టైరును విప్పి సమీపంలోని నందిపాడు సెంటర్‌కు పంచర్ వేయించేందుకు వెళ్లాడు. కోటపాటి ఆంజనేయులు రోడ్డు అవతలి వైపు పడుకోగా, ఆంజనేయులు కుమారుడు నవీన్ (19), నరసింహారావు (65) నిలిపి ఉన్న వాహనం పైభాగాన పడుకుని ఉన్నారు. అర్ధరాత్రి సమయం దాటిన తర్వాత గుర్తుతెలియని వాహనం ట్రాలీ ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో వాహనంపై నిద్రిస్తున్న నవీన్, నరసింహారావు బండరాళ్లపై పడి తలపై తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. అలాగే వాహనంలోని మరో ఎద్దు మృతిచెందింది. సమాచారం అందుకున్న దుత్తలూరు ఎస్‌ఐ వెంకటరాజేష్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.