క్రైమ్/లీగల్

బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూన్ 1: బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. చింతల్, గణేశ్‌నగర్‌లో నివాసముండే కృష్ణమూర్తి, లత దంపతుల కొడుకు సాయిచరణ్(24), ఓ కూతురు సంతానం. కృష్ణమూర్తి మిర్చి వ్యాపారం చేస్తుంటాడు. సాయిచరణ్ సీఎంఆర్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. శుక్రవారం సాయంత్రం సాయిచరణ్ బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణాన్ని చూసిన కృష్ణమూర్తి, లత స్పృహ కోల్పోయారు. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సాయిచరణ్ ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.