క్రైమ్/లీగల్

లోయలో పడిన బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా, జూన్ 1: హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. సిమ్లా నుంచి ఠిక్కర్‌కు వెళుతున్న బస్సు 500 అడుగుల లోతు ఉన్న లోయలోకి పడిపోయింది. డ్రైవర్ మితిమీరి వేగంగా నడపడంతో బస్సు అదుపు తప్పి లోయలో పడిందని, ముగ్గురు మహిళలతో సహా ఎనిమిది మంది మరణించారని పోలీసులు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణీకులు ఉన్నారు. హిమాచల్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఈ బస్సు సిమ్లాకు 45 కి.మీ దూరంలో చిహాలియా వద్ద దుర్ఘటనకులోనైందని పోలీసులు చెప్పారు. ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు సిమ్లాలోని ఇందిరా గాంధీ వైద్య కాలేజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించారు. బస్సు లోయలో పడి తుక్కుతుక్కయింది. దీనిని వెలికితీసే పనిని ముమ్మరం చేశారు. గాయపడిన మరో ముగ్గురు వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.