క్రైమ్/లీగల్

కన్న కొడుకులను చిదిమేసిన కిరాతక తండ్రి -- * శోకసంద్రంలో బాలగంగనపల్లె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగాధరనెల్లూరు, ఆగస్టు 6: ఒకే కుటుంబానికి చెందిన అభం శుభం ఎరుగని ముగ్గురు చిన్నారులు తండ్రి చేతిలో బలైపోవడాన్ని జీర్ణించుకోలేని వెంకటేష్ స్వగ్రామం బాలగంగనపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన తండ్రి వెంకటేష్ ముగ్గురు చిన్నారులను హతమార్చిన సంఘటన గంగాధరనెల్లూరులోని నీవా నది వద్ద సోమవారం చోటుచేసుకుంది. (ప్రధాన వార్త మెయన్ ఎడిషన్‌లో) పోస్టుమార్టం అనంతరం సోమవారం సాయంత్రం 5 గంటలకు చిన్నారుల మృతదేహాలు బాలగంగన్నపల్లికి చేరుకున్నాయి. దీనితో అప్పటికే ఉత్కంఠ, బాధాతప్త హృదయాలతో ఎదురుచూస్తున్న గ్రామస్తులు ఒక్కసారిగా కన్నీరుమున్నీరయ్యారు. ముఖ్యంగా చిన్నారుల తల్లితోపాటు వారి సమీప బంధువుల ఆర్తనాదాలు పలువురిని కలచివేసింది.

రైతు మృతిపై అధికారుల విచారణ
పెద్దతిప్ప సముద్రం, ఆగస్టు 6: మండలంలోని తుమ్మరకుంట పంచాయతీ, నవాబుకోటకు చెందిన దళిత రైతు గుమ్మసముద్రం గంగులప్ప పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనపై సోమవారం రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహశీల్దార్ హనుమంతు, ఆర్‌ఐ సయ్యద్ అహ్మద్‌లు రైతు కుటుంబ సభ్యులను పరామర్శించి వివరాలు అడిగితెలుసుకున్నారు. నివేధికను జిల్లా కలెక్టర్‌కు పంపుతామన్నారు.