క్రైమ్/లీగల్

బ్రిడ్జి కింద కవల పురిటి బిడ్డల మృతదేహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, అక్టోబర్ 2: చిత్తూరు నగరం ఇరువారం బ్రిడ్జి కింద కవల పురిటి బిడ్డల మృత దేహాలు ఉండటం నగరంలో కలకలం రేకెత్తించింది. ఈ సంఘట మంగళవారం రాత్రి వెలుగు చూసింది. చిత్తూరు నగర శివారులోని ఇరువారం బ్రిడ్జి కింద రెండు పురిటి బిడ్డల మృత దేహాలు ఉన్నాట్లు గుర్తించిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో ఈ సంఘట వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని మహిళకు పురిటి నొప్పులు రావడంతో బ్రిడ్జి కిందు వెల్లి ప్రసవించి ఉద్దేశ్య పూర్వకంగా కన్న తల్లే పురిటి బిడ్డలను వదిలి వేసి వెల్లడంతో బిడ్డలు మృతి చెందారా, నెలలు నిండకనే ప్రసవం కావడంతో బిడ్డలు పుట్టుగానే మృతి చెందారా అన్నది తేలాల్సి ఉంది. ఈ కవలు పిల్లల్లో ఒరకు ఆడ మరోకరు మగ బిడ్డ గుర్తించారు. బ్రిడ్డి కింద రక్తం మరకలు ఉన్న నేపధ్యంలో గుర్తు తెలియని గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో ఈ బ్రిడ్జి కిందికి వెల్లి ప్రసవించినట్లు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం పోలీసులు సంఘటనాస్థలానికి వెల్లి అక్కడ ఉన్న పురిటి బిడ్డల మృత దేహాలను చిత్తూరు ఆసుపత్రికి తరలించారు. ముందుగా ఇరువారం బ్రిడ్జి కింద చిన్నారులు మృత దేహాలు ఉండటంతో నగరంలో అనేక రకాల వదంతులు వ్యాపించాయి. దీంతో ఈ సంఘట నగరంలో కలకలం సృష్టించింది. పోలీసులు ఇరువారం పరసర ప్రాంతాల్లోని ప్రజల ద్వారా ఈ సంఘటపై ఆరా తీస్తున్నారు. స్థానిక మహిళ ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారు లేక సుదూర ప్రాంతానికి చెందిన మహిళ ఇక్కడికి వచ్చి గుట్ట చప్పుడు కాకుండా ప్రసవించి పారిపోయిందా అన్న కోణంలో పోలీసు దర్యాప్తు చేస్తున్నారు.

కారు ఢీకొని స్కూటరిస్టు మృతి
రేణిగుంట, అక్టోబర్ 2: కరకంబాడి - తిరుపతి మార్గమధ్యంలో పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం రాత్రి 7గంటలకు కారు ఢీకొని స్కూటరిస్టు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు తారకరామా నగర్‌లో డిష్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న రాజన్ (55) తిరుపతిలో పనులు ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో పెట్రోల్ బంక్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న సమయంలో వేగంగా వచ్చిన గుర్తు తెలియని కారు ఢీకొంది. అయితే ప్రమాదానికి కారు ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయం కావడంతో రాజన్ అక్కడికక్కడే మృతి చెందాడు. రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.