ఆంధ్రప్రదేశ్‌

పోలవరంపై మోదీ మాటలు విడ్డూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పోలవరంపై ప్రధాని మోదీ మాటలు విడ్డూరంగా ఉన్నాయని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆయన గురువారంనాడు విలేకర్లతో మాట్లాడుతూ ప్రధాని నిన్న బీజేపీ నేతలతో మాట్లాడుతూ పోలవరానికి ఏడువేల కోట్ల రూపాయలను కేంద్ర విడుదల చేసిందని, ఈ ప్రాజెక్టును ఏపీ సక్రమంగా నిర్వహించటం లేదని కాగ్ సైతం పేర్కొందని అనటం పట్ల ఆయన నిరసన వ్యక్తంచేశారు. ఓవైపు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రాజెక్టు పట్ల సంతృప్తి వ్యక్తంచేస్తుంటే మరో వైపు మోదీ ఈ ప్రాజెక్టును సందర్శించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయటాన్ని ప్రశ్నించారు. ఏపీ పట్ల మోదీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.