క్రైమ్/లీగల్

ట్రాక్టరు బోల్తా: 25 మందికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొల్లప్రోలు, ఏప్రిల్ 2: గొల్లప్రోలు మండలం వనె్నపూడి గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి ట్రాక్టరు బోల్తాపడిన ఘటనలో 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యు కొత్తపల్లి మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన సుమారు 30 మంది శుభకార్యం నిమిత్తం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామానికి ట్రాక్టరుపై వచ్చారు. భోజనాల అనంతరం తిరిగి వెడుతుండగా వనె్నపూడి శివారులో ట్రాక్టరు బోల్తాపడింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో నాగళ్ల రామలక్ష్మి, తలపంటి లక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. అలాగే రాయుడు అప్పలకొండ, నాగళ్ల లక్ష్మి, కొయ్యా వీరమణి, కొప్పిశెట్టి సత్యవతి, నాగళ్ల ముసలమ్మ, పిర్ల మూలమ్మ, యాదాల అప్పలకొండ తదితరులు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నేమాల సుబ్బలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి శివకృష్ణ తెలిపారు. సంఘటనా స్థలాన్ని పిఠాపురం సీఐ అప్పారావు పరిశీలించారు.