ఆంధ్రప్రదేశ్
విద్రోహశక్తులకు ముద్రగడ అండ: మంత్రి గంటా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 8 June 2016
కడప: కాపుగర్జన సందర్భంగా తుని వద్ద జరిగిన విధ్వంసకాండలో పాల్గొన్న విద్రోహశక్తులకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అండగా నిలుస్తున్నారని ఎపి మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం ఆరోపించారు. విధ్వంసకాండకు బాధ్యులెవరో ముద్రగడ బహిర్గతం చేయాలన్నారు. అరెస్టులను అడ్డుకోవడం ద్వారా తన ఉనికిని కాపాడుకోవాలని తాపత్రయ పడడం సరికాదన్నారు. రౌడీషీటర్లు, నేరస్థులనే పోలీసులు అరెస్టు చేస్తుండగా, వారిని విడిచిపెట్టకుంటే ఆమరణ దీక్ష చేస్తానని ఆయన అనడం విడ్డూరంగా ఉందని గంటా విమర్శించారు.