తెలంగాణ
గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతం: 45 శాతం పోలింగ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 2 February 2016
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. గత ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగిందని, 45 శాతం వరకూ ఓటర్లు పోలింగ్లో పాల్గొన్నారని అధికారులు తెలిపారు. పాతబస్తీలోని కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు మినహా హింసాత్మక ఘటనలు ఎక్కడా చోటు చేసుకోలేదు. పాతబస్తీలో కాంగ్రెస్ నేతలపై ఎంఐఎం కార్యకర్తలు రాళ్లు రువ్వారు. కొన్ని చోట్ల ఉదయం ఇవిఎంలు కొంతసేపు మొరాయించినా ఆ తర్వాత వాటిని సరిదిద్దారు.