గుంటూరు

న్యాయస్థానాల పవిత్రతను కాపాడుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్నూరు, సెప్టెంబర్ 23: న్యాయసంరక్షణకు నిర్దేశించిన న్యాయస్థానాలు ఎంతో ఉన్నతమైనవి.. పవిత్రమైనవని జిల్లా జడ్జి హరిహరనాధశర్మ కొనియాడారు. పొన్నూరు సివిల్ జడ్జి కోర్టును పట్టణ కూడలి ప్రాంతమైన ఆలపాటి సుబ్బరాయుడు ధర్మసత్రంలోకి శనివారం బదలాయించారు. ఈ సందర్భంగా జడ్జి హరిహరనాధశర్మ కోర్టు హాలు, జడ్జి చాంబర్, బార్ అసోసియేషన్ హాలులో వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వి లీలాప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా జడ్జితో పాటు బాపట్ల సీనియర్ సివిల్ జడ్జి ఎం శోభారాణి, అదనపు సివిల్ జడ్జి కె రవి, పొన్నూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిలు ఎస్ శ్రీనివాస్, ఎస్‌కె ఆరిఫా, ఏవివిఎన్ లక్ష్మి, సీనియర్ న్యాయవాది సుబ్బారావు, బాపట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యప్రసాద్ తదితరులు ప్రసంగించారు.