గుంటూరు

మూగ బాలికపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడికొండూరు, మే 27: మండలంలోని డోకిపర్రు శాంతిపాలెంకు చెందిన అభం శుభం తెలియని మూగ బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై శుక్రవారం బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి... మండలంలోని శాంతిపాలెంకు చెందిన మైనర్ బాలిక గురువారం ఇంట్లో ఒంటరిగా సమయంలో అదే కాలనీకి చెందిన మరియదాసు అనే వ్యక్తి మాయమాటలు చెప్పి ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని నాదెండ్ల మండలం సాతులూరు-సందారం మధ్య అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పవద్దని భయపెట్టాడు. అదేరోజు రాత్రి తిరిగి శాంతిపాలెంకు తీసుకువచ్చి వదిలిపెట్టాడు. విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు వివరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి సిఐ బాలాజీ కేసు దర్యాప్తు చేస్తున్నారు.