గుంటూరు

రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు చంద్రబాబే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, జూన్ 2: రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడేనని, నీరు చెట్టు, ఇసుక దోపిడీతో అవినీతికి అడ్డాగా మారుస్తున్నారని రాష్ట్ర వైసిపి కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున ఆరోపించారు. గురువారం తెనాలి వైసిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నాడు రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడైన చంద్రబాబు నేడు అసత్య మాటాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అంతా బిజెపినే చేసిందంటూ కల్ళబొల్లి మాటలు చెప్పి మాయం చేస్తున్నారన్నారు. రెండు నాల్కల ధోరణితో రాష్ట్రంలో, కేంద్రంలో అక్కడొక మాట, ఇక్కడొక మాట చెప్పి పబ్బం గడుపుకుంటున్నారన్నారు. ప్రభుత్వం నీరుచెట్టు, ఇసుక మాఫియా స్కీమ్‌లతో అవినీతికి తెరతీసి వైసిపి ఎమ్మెల్యేలకు ఆశజూపి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. అంతటికితో అగక తన కుమారుడు లోకేష్‌ను అక్రమాలకు, అవినీతికి మారుపేరుగా తయారుచేశారన్నారు. ఓటుకు నోటు కేసులో జైలుపాలౌతాననే భయంతో తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నా నోరు మెదపకుంటా ప్రజాపక్షాన పోరాటాలు చేస్తున్న వైసిపి నేత జగన్‌పై విమర్శలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రరాష్ట్ర ప్రజయోజనాలను ఢిల్లీకి తాకట్టుపెట్టిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని విమర్శించారు. సమావేశంలో వైసిపి నేతలు చింతగుంట్ల రంగారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పెరికల కాంతారావు, బూరెల దుర్గ, అక్కిదాసు కిరణ్‌కుమార్, తట్టుకూళ్ళ అశోక్‌యాదవ్, చందోలు డేవిడ్ విజయ్‌కుమార్, మల్లెబోయిన కొండాయాదవ్, ఏలూరి శేషగిరిరావుతదితరులు ఉన్నారు.